టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవల కాంట్రవర్షియల్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లని ఉద్దేశించి ఉన్నట్టుగా మహేష్ అభిమానులు భావించడంతో తరుణ్ భాస్కర్ ని ఒక ఆట సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. గతంలో కూడా 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలో ఈ విధంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహాన్ని తరుణ్ భాస్కర్ చూడటం జరిగింది. ఆ టైంలో తరుణ్ భాస్కర్ కొద్దిగా టంగ్ స్లీప్ అవటంతో చాలా మూల్యాన్ని చెల్లించుకున్నడు. ఇప్పుడు ఇదే రీతిలో మహేష్ అభిమానుల విషయంలో కూడా అదే రీతిలో సీన్ క్రియేట్ అవుతోంది. మలయాళ మూవీ ‘కప్పెల’ చూసి తరుణ్ భాస్కర్ చెప్పిన అభిప్రాయం మహేష్ బాబు ని టార్గెట్ చేసినట్లు ఉందని మహేష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.

 

మలయాళ మూవీ ‘కప్పెల’ చూసి ఇటీవల సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ పెట్టిన పోస్ట్….‘‘హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో రీఎంట్ర ీఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో’’..ఇది పెట్టాడు.

 

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల పై తరుణ్ భాస్కర్ టైర్లు వేశారని అందరూ భావించిన చివరిలో రైతులు మరియు సైనికులు ప్రస్తావన తీసుకు రావడంతో అది మహేష్ నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలను ఉద్దేశించి అన్నాడని… మహేష్ అభిమానులు తీవ్రస్థాయిలో తరుణ్ భాస్కర్ పై సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క కామన్ నెటిజన్లు తరుణ్ భాస్కర్ ఉన్నదే అన్నాడు అందులో తప్పేమీ లేదు కదా దేనికి అంత కోపం మహేష్ అభిమానులకి అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోపక్క మహేష్ అభిమానులు మాత్రం తరుణ్ భాస్కర్ ని బండ బూతులు తిడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: