సినిమాలో ఇప్పుడు దాదాపుగా ప్రయోగాలు చేసే విషయంలో హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చదువుతూ ఉన్నాం. స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు వారి వారి సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలను నిర్మించే విషయంలో దర్శక నిర్మాతలు కూడా జాగ్రత్తలు పడుతున్న నేపధ్యంలో  ప్రయోగాలు అనే ఆలోచన అసలు చేయడం లేదు స్టార్ హీరోలు. ఇప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ప్రయోగాల విషయంలో వెనక్కు తగ్గారు అని సమాచారం. 

 

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్త ప్రయోగం చెయ్యాలి అని చూసాడు అని అంటున్నారు. కాని ఆ సినిమా విషయంలో అంత అవసరం లేదు అని ఆలోచనలో పడ్డాడు అని సమాచారం. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా విషయంలో అదే విధంగా ఆలోచిస్తున్నాడు అని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా విషయంలో దాదాపుగా ఎన్టీఆర్ ఇప్పుడు జాగ్రత్తగానే ఆలోచించడం మొదలు పెట్టాడు. కథ విషయంలో కూడా ప్రయోగం వద్దు అని  కమర్షియల్ గా ఉండటం తో పాటుగా మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పాడు అని సమాచారం. 

 

మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు దాదాపుగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రయోగాల గురించే చర్చలు అన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ప్రయోగాలు చేస్తారా లేదా అనేది చూడాలి. మహేష్ బాబు అయితే వద్దు అని పరుశురాం కి చెప్పేసాడు అని సమాచారం. ఇక వచ్చే ఏడాది సినిమాల విషయంలో కూడా అతను ఇదే విధంగా ఆలోచనలో పడ్డాడు అని అంటున్నారు మరి. అసలు ఎం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: