ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్ వకీల్ సాబ్ తో మళ్లీ ఫ్యాన్స్ ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పిరియాడికల్ మూవీ చేస్తాడని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారట. 26 సినిమాల కెరియర్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇలాంటి ప్రయోగం చేయలేదు. అందుకే క్రిష్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఏ.ఎం రత్నం నిర్మిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

 

ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఉంటాడని తెలుస్తుంది. చరణ్ చేసేది కెమియో రోల్ అయినా కూడా ఓపెనింగ్ సీన్ లోనే చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. సైరా సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క కనిపించి సర్ ప్రైజ్ చేసినట్టుగా చరణ్ పవర్ స్టార్ సినిమాలో కనిపిస్తాడట. చేసేది 10 నిమిషాల రోల్ అయినా సినిమాలో చరణ్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కచ్చితంగా ఓ హిట్టు సినిమా కొట్టాలన్న కసితో ఉన్న క్రిష్ పవర్ స్టార్ తో సినిమా ప్లాన్ చేశాడు.

 

సినిమా కోసం హిస్టారికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందని తెలిసిందే. అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాలో ఉంటాడని తెలుస్తుంది. క్రిష్, పవన్ మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా చూడాలి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: