మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, బిజినెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొనడం సహజం. అంచనాలు, సెంటిమెంట్ కు తగ్గట్టే సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేస్తారు. చిరంజీవి ఆచార్యలో ఓ ముఖ్యపాత్ర ఎవరు చేస్తారనేదానిపై ఎప్పటినుంచో తర్జనభర్జనలు జరుగుతున్నాయి కానీ.. ఆ పాత్రలో నటించేది ఎవరో ఇంతవరకూ క్లారిటీ లేదు. అలాగే.. ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడో ఆసక్తికర న్యూస్ రౌండ్ అవుతోంది.

IHG'Sye Raa'? | The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> Minute

 

సినిమాలో ముఖ్యమైన పాత్ర చిరంజీవి చెల్లెలు పాత్ర. ఈ పాత్రలో ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు పలువురు సీనియర్ హీరోయిన్ల పేర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి చెల్లెలు పాత్రలో తమిళ నటి ఖుష్బూ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ఆమెను సంప్రదించారిన కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. కొద్దిరోజుల క్రితం ఇదే పాత్రను సుహాసిని చేయబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఖుష్బూ పేరు రౌండ్ అవుతోంది. ఈ వార్తలో నిజానిజాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ లేకపోయినా.. మెగాభిమానులు మాత్రం ఖుష్బూ ఎంపికపై పెదవి విరుస్తున్నారని అంటున్నారు.

IHG

 

ఇందుకు కారణం లేకపోలేదు. 2006లో చిరంజీవికి అక్కగా స్టాలిన్ లో నటించింది. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. తర్వాత 2018లో వచ్చిన పవన్ అజ్ఞాతవాసిలో నటించింది. ఈ సినిమా ఏకంగా పవన్ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలింది. ఈ ఉదాహరణలతో సెంటిమెంట్ గా భావించి మెగాభిమానులు ఖుష్బూ అంటూ పెదవి విరుస్తున్నారు. మరి ఖుష్బూ ఎంపికపై నిజాలను సుజీత్ టీమ్ మాత్రమే అఫిషియల్ న్యూస్ ఇవ్వాల్సి ఉంది. ఆచార్యలో సెంటిమెంట్ ప్రకారమే త్రిషను వద్దన్నారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: