వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో పాగా వేయాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో బాగా వేయిట్ ఉన్న పాత్రలు చేస్తూ బాగా పాపులర్ అయింది. అయితే హీరోయిన్ గా మాత్రం సక్సస్ కాలేదు. ఇక తెలుగులోను వరలక్ష్మీ అడపా దడపా సినిమాలు చేస్తుంది. కాని ఇక్కడ కూడా అమ్మడికి హీరోయిన్ గా అవకాశాలు కాకుండా క్యారెక్టర్స్ మాత్రమే వస్తున్నాయి. అయినా వాటితోనే టాలీవుడ్ లో గట్టిగా నిలబడాలని అనుకుంటుంది. అంతేకాదు హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంది. 

 

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలో రవితేజ గోపీచంద్ కాంబినేషన్ లో బలుపు, డాన్ శీను వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నారు.

 

ఇక ఈ సినిమా రవితేజ, గోపీచంద్, చాలా రోజులకి మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్ కి సక్సస్ అవడం చాలా కీలకం. అంతేకాదు ఇదే సినిమాలో నటిస్తున్న వరలక్ష్మీ కి చాలా కీలకం అని చెప్పాలి. ఈ సినిమాలో దర్శకుడు సముద్రఖని కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు వరలక్ష్మీ మరో సినిమాలో నటిస్తుంది. అదే అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా. నాంది టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. రవితేజ క్రాక్ సినిమాకి అలాగే నరేష్ నాంది సినిమాకి మంచి బజ్ క్రియోటయింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో నిలదొక్కుకుంటుందా లేదా చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: