టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన ప్రేయసి షాలినిని వివాహం చేసుకోనున్నాడని తెలిసిందే. నిజానికి కరోనా లేకుంటే ఏప్రిల్ లోనే దుబాయ్ లో వీరి పెళ్లి జరిగేది కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఆగస్టులోపు కరోనా పూర్తిగా తగ్గితే పెళ్లిని గ్రాండ్ గా చేసుకుందామనుకున్నాడు నితిన్ అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కరోనా హవా తగ్గేలా కనిపించకపోవడంతో నితిన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. జూలై లోనే అంగరంగ వైభంగా కాకుండా అతి కొద్దీ మంది సమక్షంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా పెళ్లికి డేట్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. వచ్చే నెల 26న హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో నితిన్ -షాలిని వివాహం జరుగనుందట.  
 
ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈహీరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు అందులో రంగ్ దే ఒకటి. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఆగస్టు నుండి మిగిలిన షూటింగ్  ప్రారంభం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 
ఈ సినిమాతోపాటు నితిన్  ప్రస్తుతం సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా భవ్య క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈసినిమాల తరువాత నితిన్,అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇవే కాకుండా వచ్చే ఏడాది కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నితిన్, పవర్ పెట్ లో నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: