తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ పేరు ప్రస్తుతం ఎక్కడా కూడా వినబడటం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో అనేక అవకాశాలు అందుకుని కుర్రకారు లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా నటించిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో 'రాక్షసుడు' సినిమాలో హీరోయిన్ గా చేసింది. సినిమా పెద్దగా ఏమీ అడగలేదు దీంతో ఈమెకు కూడా మంచి పేరు ఏమి దక్కలేదు. కానీ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో రక్తికట్టించింది. అప్పటినుండి ఇప్పటివరకు ఏ ఒక్క ఆఫర్ దక్కించుకోలేదు. అనుపమ పరమేశ్వరన్ సినిమా వచ్చి సంవత్సరం అయిపోయింది.

IHG

గత ఏడాది 'రాక్షసుడు' మరియు మలయాళంలో ఓ సినిమా మొత్తం కలిపి రెండు సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మాత్రం కన్నడ లో ఎంట్రీ ఇస్తూ ఓ భారీ సినిమా కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటుగా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా తమిళంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'నిన్ను కోరి' సినిమా లో నివేదా పాత్ర తమిళంలో అనుపమ చేస్తున్నట్లు సమాచారం.

IHG

దీంతో సౌత్ లో అనేక భాషల్లో సినిమాలు చేస్తున్నాకానీ తెలుగులో అనుపమ కి అవకాశాలు రాకపోవడంతో ఇక ఈమె కెరీర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పులిస్టాప్ పడినట్లేనా అనే డిస్కషన్ ప్రజెంట్ ఫిలింనగర్ లో జరుగుతుంది. దాదాపు ఏ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడిన పూజాహెగ్డే మరియు రష్మిక మందన పేర్లు వినపడుతున్నాయి వారి కంటే ముందు అనుపమ ఇండస్ట్రీ లో వచ్చి మంచి క్రేజ్ దక్కించుకుంది. అలాంటిది అవకాశాలు రాకపోవడంతో ఈ కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కెరియర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: