షూటింగ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాల కన్నా సీరియల్స్ నే ముందు స్టార్ట్ చేశారు. అయితే సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అందరు షాక్ అయ్యారు. ప్రభాకర్ చేస్తున్న సీరియల్ ఆర్టిస్తులందరిని క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు. ఈమధ్య యాంకర్ కం డైరక్టర్ ఓంకార్ కు కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని తేలింది. ఎవరో గిట్టని వారు ఓంకార్ పై నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఇక లేటెస్ట్ గా సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.

 

నా పేరు meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ లో నటిస్తున్న నవ్య స్వామి జూన్ 15 నుండి సీరియల్ షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే లేటెస్ట్ గా ఆమెకు అన్ హెల్తీగా ఉండగా కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. సో మళ్లోసారి బుల్లితెర మీద కరోనా ప్రభావం బాగానే పడేలా కనిపిస్తుంది. ఆమెతో షూటింగ్ లో పాల్గొన్న వారిని క్వారెంటైన్ లో ఉండేలా చూస్తున్నారు. ఆమె షూటింగ్ టైం లో ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు వాళ్లందరిని కూడా హోం క్వారెంటైన్ ఉండేలా డాక్టర్స్ సూచిస్తున్నారు. 

 

ఇలాంటిదేదో జరుగుతుందనే ఉద్దేశంతోనే సినిమా షూటింగ్స్ చేసుకోండని పర్మిషన్ వచ్చినా ఆగిపోయారు. మునుపటి కన్నా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఇలాంటి టైం లో షూటింగ్ స్టార్ట్ చేయడం అసలేమాత్రం శ్రేయష్కరం కాదని చెప్పొచ్చు. మరి బుల్లితెర నటి నవ్యా స్వామికి కరోనా పాజిటివ్ అని తేలగా ఆమె గురించి మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. చూస్తుంటే సీరియల్స్ షూటింగ్ కూడా మళ్లీ కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చేలా ఉన్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: