బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. భారతదేశంలో మొదటగా హిందీలో స్టార్ట్ అయిన ఈ గేమ్ షో, ఇప్పుడు అన్ని భాషల్లోకి వచ్చింది. టెలివిజన్ తెరపై ప్రేక్షకుల మెప్పు పొంది అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుంటున్న రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఈ షో ఇప్పటి వరకు మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగవ సీజన్ కి సిద్ధం అవుతుంది.

 

అయితే బిగ్ బాస్ ఎంత ఫేమస్సో అందులో కంటెస్టెంట్లుగా వచ్చినవారు కూడా అంత ఫేమస్ అవుతుంటారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా రావడానికి అందరూ ఇంటెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేవారిలో చాలా మంది సినిమాకి సంబంధించిన సెలెబ్రిటీలు ఉండనున్నారని తెలుస్తుంది. మొన్నటికి మొన్న బిత్తిరి సత్తి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వస్తున్నాడన్న వార్త బయటకి వచ్చింది. 

 

తాను ప్రస్తుతం పనిచేస్తున్న టీవీ ఛానెల్ కి రాజీనామా చేసాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాడని అంటున్నారు.  ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్లు అయిన శ్రద్ధా దాస్, హంసా నందినీ, ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్లుగా రానున్నారట. తాజాగా టాలీవుడ్ కి చెందిన నలుగురు సెలెబ్రిటీలు బిగ్ బాస్ లో సందడి చేయనున్నారని మాటలు వినిపిస్తున్నాయి. 

 


సింగర్ సునీతతో పాటు యాక్టర్ నందు, యాంకర్ కమ్ నటి ఝాన్సీ ఇంకా కమెడియన్ తాగుబోతు రమేష్.. ఈ నలుగురిని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందని అంటున్నారు. వీరిలో తాగుబోతు రమేష్ ఈ మధ్యే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడా అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: