భీష్మ సినిమాతో కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్, వ్యక్తిగతంగా తన జీవితంలోకి తాను ప్రేమించిన షాలినీని ఆహ్వానించి పెళ్ళి వార్త చెప్పాడు. ఈ ఏడాది మార్చిలోనే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న నితిన్, ఏప్రిల్ లో పెళ్ళి పెట్టుకున్నాడు. దుబాయ్ లోని ఖరీదైన రిసార్ట్ లో తన పెళ్ళి వేడుకని జరుపుకోవాలనుకున్నాడు. అయితే సడెన్ గా కరోనా వైరస్ మనదేశం దాకా రావడంతో నితిన్ పెళ్ళి వాయిదా పడింది.

 

IHG

అప్పటి నుండి ఇప్పటి వరకూ కరో ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దాంతో పెళ్ళి తదితర ఫంక్షన్లకి ఎక్కువ మంది రాకూడదని, పరిమిత సంఖ్యలో అతిధులు ఉండాలని నిబంధనని పెట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో నిఖిల్ తన పెళ్ళి చేసేసుకున్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కువ అతిధులు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పెళ్ళి తంతు కానిచ్చేసాడు. అయితే ఆ టైమ్ లో నితిన్ కూడా తన పెళ్ళిపై నోరువిప్పుతాడని అనుకున్నారు. 

 

 

కానీ కరోనా నియంత్రణలోకి వచ్చాక చేసుకుందామన్న ఆలోచనతో ఇప్పట్లో చేసుకోడని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ తన పెళ్ళిపై ఒక నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అటు రానా అనుకున్న ప్రకారం ఆగస్టు 8వ తేదీన పెళ్ళికి ఫిక్స్ అవుతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో నితిన్ కూడా ముందుకు కదులుతున్నాడని టాక్ వినబడుతుంది. కరోనా వల్ల పరిస్థితులు మరింత కష్టతరంగా మారుతున్న సమయంలో మరింత ఆలస్యం చేయకుండా వచ్చే నెలలో పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడవ్వాలని డిసైడ్ అయ్యాడట.

 

 

జులై 26న పెళ్ళి డేట్ పిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ ప్రముఖ రిసార్ట్ లో జరగనుందని ప్రచారం జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: