లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. షూటింగ్‌లో, నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు అన్ని ఆగిపోవటంతో సినిమాలకు సంబంధించ ఎలాంటి వార్తలు బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజెన్లు సినీ తారలకు సంబంధించిన పాత విషయాలను తిరిగి నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వివాదాస్ప అంశాలే తెర మీదకు వస్తున్నాయి.

 

అలా తెర మీదకు వచ్చిన అంశామే అక్షయ్‌ కుమార్‌, శాంతి ప్రియలది.  బాలీవుడ్‌ లో యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు చాలా మంచి పేరుంది. ఇటీవల వరుసగా మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తున్న అక్షయ్‌ ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్‌ లోనూ పాజిటివ్ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే గతంలో అక్షయ్‌ పై ఓ హీరోయిన్ కొన్ని ఎలిగేషన్స్ లాక్‌ డౌన్‌ కారణంగా తెర మీదకు వచ్చాయి. తన శరీరం గురించి అక్షయ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ గతంలో శాంతి ప్రియ అనే హీరోయిన్‌ కామెంట్స్ చేసింది.

 

శాంతిప్రియ, అక్షయ్‌ కుమార్‌లు ఇక్కే పె ఇక్కా, సౌగంధ్‌ సినిమాల్లో కలిసి నటించారు. సినిమా షూటింగ్‌ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న కాస్ట్యూమ్‌లో షూటింగ్ స్పాట్‌ వచ్చిన సందర్భంలో అక్షయ్‌ ఆమె మోకాళ్లను చూసి అక్కడ రక్తం గడ్డ కట్టిందా అన్నాడట. ఆమె మోకాళ్లు నల్లగా ఉండటంతో అక్షయ్‌ సరదాగా ఆ కామెంట్ చేశాడు. అయితే అక్కడున్నవారంత ఒక్కసారిగా నవ్వటంతో శాంతి ప్రియకు చాలా ఇబ్బందిగా అనిపించి బోరున ఏడ్చేసింది. ఇదే విషయాన్ని అప్పట్లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించింది. అయితే అదే వార్త మరోసారి వైరల్‌ కావటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది శాంతి ప్రియ.

 

`నేను మీ అందరికీ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వ దలుచుకున్నాను. ఆ రోజు అక్షయ్‌ నా విషయంలో చేసిన కామెంట్స్ సరదాగానే అని నాకు తెలుసు. ఆ వ్యాఖ్యలు నన్ను కాలం పాటు వెంటాడినా అక్షయ్‌ నన్ను ఇబ్బంది పెట్టాలని గానీ, అవమానించాలని గానీ ఆ వ్యాఖ్యలు చేయలేదని నాకు తెలుసు. నాకు ఆయన పనితీరు చాలా ఇష్టం` అంటూ క్లారిటీ ఇచ్చింది శాంతి ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి: