ఇటీవల నటి పూర్ణ కు వేదింపుల వ్యవహారం దేశవ్యాప్తం గా సంచలనం గా మారింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవటం తో పూర్ణ స్వస్థలం కేరళ కు వెళ్లిపోయింది. అయితే ఈ బ్యూటిని కిడ్నాప్ చేసేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నించింది. పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. కొద్ది రోజులు గా నటి పూర్ణ కు సోషల్ మీడియాలో వేదింపులు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఆ వేదింపులు ఎక్కువ కావటంతో పాటు డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులు కూడా మొదలయ్యాయి. దీంతో ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం తో వెంటనే స్పందించిన పోలీసులు బెంగళూరులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు లో మరిన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ వివరాలను కొచ్చి పోలీస్ కమీషనర్ విజయ్ సఖారే మీడియాకు వెల్లడించారు. నటి పూర్ణను 12 మంది ఉన్న గ్యాంగ్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని వారిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు.
మార్చి నెల పాలక్కాడ్ లో ఎనిమిది మంది మోడల్స్ ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూళు చేసిన ముఠాకు ఇదే అని పోలీసులు తెలిపారు. పూర్ణకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆ పనుల్లో భాగంగా వాళ్లతో సంబంధాలు కలుపుకొని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టుగా పోలీసులు వెల్లడించారు.
గతంలో ఇదే గ్యాంగ్ ప్రొడ్యూసర్లం అని చెప్పి కొంత మంది మోడల్స్, నటీనటుల డిటెయిల్స్ తీసుకొని వారిని బెదిరించి డబ్బులు వసూళు చేశారని పోలీసులు వెల్లడించారు. పూర్ణ ఇచ్చి కంప్లయింట్ మేరకు వీరిపై 7 కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.