ఏ సిని పరిశ్రమలో అయినా మల్టీస్టారర్ అంటే చాలు భారీ క్రేజ్ ఏర్పడినట్టే. టాలీవుడ్ లో ఈమధ్య మల్టీస్టారర్ హవా కొనసాగుతుండగా కోలీవుడ్ లో కూడా క్రేజీ మల్టీస్టారర్స్ కు ప్లాన్ చేస్తుంటారు. బాలీవుడ్ లో అయితే తరచు మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇక లేటెస్ట్ గా ఓ క్రేజీ మల్టీస్టారర్ కు సంబందించిన న్యూస్ ఒకటి సిని ప్రియులను అలరిస్తుంది. అదికూడా తండ్రి కొడుకులు చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఆ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

 

ఇంతకీ ఆ మల్టీస్టారర్ సినిమా ఏంటి అంటే.. కోలీవుడ్ విలక్షణ నటుడు స్టార్ హీరో విక్రం, తనయుడు ధ్రువ్ కలిసి చేస్తున్న సినిమా. ప్రీ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అంటే సినిమాలో ధ్రువ్ మెయిన్ లీడ్ కాగా విక్రం అందులో కొద్దిగా నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ట్విస్టులు అదిరిపోతాయట. కార్తిక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాపై కోలీవుడ్ ఆడియెన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.

 

కొన్నళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని విక్రం కూడా ఇక మీదట కథల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చూస్తున్నాడు. ప్రస్తుతం విక్రం నటించిన కోబ్రా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మణిరత్నం డైరక్షన్ లో తెరకెక్కే సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఇదే కాకుడా గౌతం మీనన్ డైరక్షన్ లో సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. మరి తనయుడితో విక్రం చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మల్టీస్టారర్ సినిమా మాత్రం విక్రం కెరియర్ లో 60 సినిమా కాగా సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: