మొట్టమొదటగా మనస్సినక్కరే అనే మలయాళ మూవీ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసిన నయనతార, ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ద్వారా హీరోయిన్ గా తమిళ సినిమా పరిశ్రమ లోకి అడుగుపెటింది. అయితే మలయాళంలో పర్వలేదనిపించిన నయన్, తమిళ్ లో మాత్రం ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ ని అందుకుంది. ఇక థ్రిల్లింగ్, సస్పెన్స్ సినిమాగా తెరకెక్కిన చంద్రముఖిలో నయనతార, దుర్గ అనే పాత్రలో నటించడం జరిగింది. నటుడు విజయ్ కుమార్ మనవరాలుగా చిన్నపిల్లలకు సంగీత విద్యను బోధించే అమ్మాయిగా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. 


అయితే ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కొట్టడంతో అక్కడి నుండి నయన్ కు వరుసగా అవకాశాలు ఊపందుకున్నాయి. ఇక దాని తరువాత తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పెట్టేసిన నయన్, ఆ సినిమాతో కూడా మరొక హిట్ ని, అనంతరం తమిళ్ లో సూర్యతో గజిని సినిమాలో కూడా నటించి ఇంకొక హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా మంచి హిట్ సినిమాలతో తన అందంతో ఆకట్టుకున్న నయన్, ఆపై మెల్లగా రొమాంటిక్ పాత్రల నుండి తన ఫోకస్ ని పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలపైకి మల్చింది. అదే సమయంలో బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాలో సీనియర్ బాలయ్య పాత్రకు జోడిగా గాయత్రి అనే పాత్రలో నటించి తన ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మెప్పు సంపాదించింది నయన్. 


సినిమా విజయంతో, దాని తరువాత బాపు, రమణలు బాలయ్యతో తీసిన దృశ్య కావ్యం శ్రీరామరాజ్యంలో ఏకంగా సీత పాత్రలో ఎంతో ఓడిగిపోయి నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇక ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఒకింత ఎక్కువగా నటిస్తున్న నయన్, ప్రస్తుతం అటు నటన, ఇటు తన అందం రెండింటిలోనూ తాను క్వీన్ అని నిరూపించకుంటూ ప్రేక్షకుల మదిని దోచుకుని స్టార్ హీరోయిన్ గా ముందుకు సాగుతోంది నయన్........!!

మరింత సమాచారం తెలుసుకోండి: