ప్రముఖ ఫోటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు విషయంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. మొన్నటి వరకు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధా అతనిపై ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసు రోజురోజుకీ ముదురుతున్నటు గానే ఉంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితురాలు సాయి సుధా, తాను రాజీ కుదుర్చుకున్నట్లు నాంపల్లి కోర్టులో శ్యామ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం శ్యామ్.కె.నాయుడు కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కాక ఎక్కడ శ్యామ్ కి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది. శ్యామ్ దొంగ సంతకం తో తాను రాజీకి వచ్చినట్లు న్యాయస్థానాన్ని నమ్మించాడు అని సాయి సుధా చెప్పుకొచ్చింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం శ్యామ్ బెయిల్ ను రద్దు చేయడం జరిగింది.

 

ఈ పరిణామంతో శ్యామ్.కె.నాయుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. కాగా తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో సాయి సుధా గతంలో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్.కె.నాయుడు ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణ అనంతరం రిమాండ్ కు తరలించారు. అయితే రిమాండ్ కి వెళ్ళిన శ్యామ్ కె నాయుడు రెండు రోజులకే సాయి సుధా ఫోర్జరీ సంతకంతో బయటకు రావడం జరిగింది.

 

అయితే బెయిల్ పిటిషన్ విషయంలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా శ్యామ్… సాయి సుధా ఫోర్జరీ సంతకం వెనకాల ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని… కావాలనే శ్యామ్.కె.నాయుడు ని ఇరికించడానికి ఈ ఎత్తుగడ వేశారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. సాయి సుధా తో శ్యామ్.కె.నాయుడు పెద్దగా తప్పు ఏమీ చేయలేదని ఆమె మరియు కొంతమంది ఆడుతున్న డ్రామాలో  శ్యామ్.కె.నాయుడు కెరియర్ డ్యామేజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: