టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. రెండు మూడేళ్లు వరుసగా ఐదారు సినిమాలు చేసిన హీరోయిన్ ను స్టార్స్ రిపీట్ చేస్తే ఆడియెన్స్ పెద్దగా రిసీవ్ చేసుకోలేరు. అందుకే హీరోయిన్ కెరియర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం దశాబ్ధ కాలంగా క్రేజ్ సంపాదిస్తూ ఇప్పటికి సూపర్ ఫాం లో ఉంటారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంటుంది. శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కొద్దిపాటి గ్యాప్ తో హ్యాపీడేస్ చేసి ఇక అక్కడ నుండి వరుస స్టార్ ఛాన్సులు అందుకుంది.

 

ఇప్పటికి అమ్మడు వరూ సినిమాలు చేస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ ఎఫ్-2తో హిట్ అందుకున్న తమన్నా ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా చేస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది. ఇక ఈమధ్యనే ప్రముఖ ఓటిటి ఆహా నుండి క్రేజీ ఆఫర్ దక్కించుకుందని తెలిసిందే. ఇదిలాఉంటే లేటెస్ట్ గా మిల్కీ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో అమ్మడు ఛాన్స్ పట్టేసిందట.

 

సినిమాలో హీరో వైఫ్ రోల్ లో ముందు శృతి హాసన్ చేస్తుందని అనుకోగా ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అందుకే తమన్నాని అడిగితే ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించిన తమన్నా ఇలాంటి టైం లో పవన్ కయాణ్ ఆఫర్ అందుకోవడం చూస్తుంటే అమ్మడికి మాములు లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. వచ్చిన ప్రతి ఛాన్స్ కు ఓకే చెబుతూ కెరియర్ లో మళ్లీ జోష్ అందుకుంది తమన్నా. రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా అమ్మడు మాత్రం తన ఫాం కొనసాగిస్తూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: