అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘వకీల్ సాబ్’ ఈపాటికి విడుదల అయిపోవడం దాని ఫలితం తెలిసిపోవడం జరిగి నెలలు గడిచిపోయి ఉండేవి. అయితే కరోనా సమస్యలతో షూటింగ్ లు ఆగిపోవడంతో ఈమూవీ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది అని అంటున్నారు.


వాస్తవానికి ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో నటించినందుకు పవన్ కు 40 కోట్ల పారితోషికం ఇవ్వడానికి దిల్ రాజ్ మొదట్లో ఒప్పుకున్నాడు అని అంటారు. పవన్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ మూవీకి అత్యంత భారీ బిజినెస్ జరుగుతుందని మొదట్లో దిల్ రాజ్ భావించాడు.


అయితే కరోనా సమస్యలు చుట్టుముట్టడంతో అన్ని పరిశ్రమలు లాగే సినిమా ఇండస్ట్రీ కూడ బాగా దెబ్బతినడంతో ఇప్పుడు టాప్ హీరోల సినిమాలకు కూడ మార్కట్ తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ తన తెలివితేటలు ఉపయోగించి ఈమధ్య పవన్ కలిసి ఒక డీల్ సెట్ చేసుకున్నట్లు లీకులు వస్తున్నాయి.


ఈ సినిమాకు సంబంధించి పవన్ కు ఇప్పటివరకు ఇచ్చిన అడ్వాన్స్ ను పక్కకుపెట్టి మిగతా పారితోషికం విషయాల గురించి పవన్ పట్టుపట్టకుండా ఈమూవీకి జరగబోయే బిజినెస్ లో మేజర్ షేర్ ను ఆఫర్ చేసినట్లు టాక్. ఈ సినిమా పెండింగ్ షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతికి ఈ కరోనా భయాలు అన్ని పూర్తిగా పోయిన తరువాత ‘వకీల్ సాబ్’ ను విడుదల చేస్తే ఈమూవీకి మంచి బిజినెస్ జరిగి తద్వారా పవన్ కు కూడ బిజినెస్ లో మంచి షేర్ వస్తుంది అని దిల్ రాజ్ చెప్పిన బిజినెస్ లెక్కలకు పవన్ ఫిదా అయినట్లు సమాచారం. దీనితో ఎలాంటి గొప్ప వ్యక్తిని అయినా తన సున్నితమైన మాటలతో ఒప్పిస్తాడు అన్న విషయం మరొకసారి రుజువైంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: