దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతుండటంతో చాలా ప్రాంతాల్లో జన సంచారం తగ్గిపోయింది. పొల్యూషన్, అలికిడి కూడ తగ్గటంతో వన్యప్రాణులు అడవులు వదిలి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిరుత పులులు, ఏనుగుల సంచారం కనిపిస్తుండగా అవి నివాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు కూడా తరుచూ వినిపిస్తున్నాయి.
తాజాగా అలాంటి ఓ సంఘటన బాలీవుడ్ అందాల భామ ఇంట్లో జరగింది. యంగ్ హీరోయిన్ అలియా భట్ తల్లి ఒకప్పటి నటి సోని రాజ్దన్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. తన స్విమ్మింగ్ పూల్లో పామును చూసి బెదిరిపోయిన బ్యూటీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
`ఈ రోజు మా స్విమ్మింగ్ పూల్కు ఓ గెస్ట్ వచ్చింది. ముందు నీళ్లు తాగి ఒక్కసారి నీటిలో మునిగి, తరువాత పొదల్లోకి వెళ్లిపోయింది` అంటూ వీడియోతో పాటు కామెంట్ చేసింది సోని. ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. నటి నీతు కపూర్ `ఇది భయానకం` అంటూ కామెంట్ చేసింది. అందుకు సమాధానం ఇచ్చిన సోని `గత తొమ్మిదేళ్లలో ఇంట్లో పామును చూడటం ఇదే తొలిసారి` అంటూ రిప్లై ఇచ్చింది.
View this post on InstagramWe had a guest in our swimming pool today. wanted to drink water at first and then went in for a dip 🙈🤷🏻♀️🥴 Well. We let it go into the bushes afterwards. #snakeinthewater