బాలీవుడ్ లో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్, రిషీ కరపూర్ అనారోగ్యంతో కన్నుమూయగా.. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ కేసులో స్వయంగా సుశాంత్ ఉరి వేసుకున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్  బాలీవుడ్ లో బంధు ప్రీతి వల్ల యువ నటులకు ఛాన్సులు రావడం లేదని.. లాటెంట్ ఉన్నా తొక్కి పడేస్తున్నారని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.  ఎంతో మంది సహనటులు అతనికి సపోర్ట్ గా పలు మెసేజ్ లు పెట్టారు.

IHG's Fans Demand To <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WATCH' target='_blank' title='watch-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>watch</a> His Last Film 'Dil ...

తాజాగా బాలీవుడ్ హీరోయిన్, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం 'దిల్ బేచారా' హీరోయిన్ సంజనా సాంఘి ప్రస్తుతం తీవ్ర ఉద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాను ఎన్నో ఆశలు పెట్టుకొని హీరోయిన్ గా రాణించాలన్న పట్టుదలదో వచ్చాను.. కానీ కరోనా కష్టకాలంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడంతో, వెండి తెరపై తాను తొలిసారి హీరోయిన్ గా కనిపించే చాన్స్ పోయినట్లయింది. ఇదే సమయంలో సహ నటుడి మరణం ఆమెలో నిరాశను నింపిందేమో, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆమె వేదాంత ధోరణితో ఓ పోస్టు పెట్టింది. "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను.

IHG

ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో... వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు... అంటూ ఎంతో ఆవేదన.. భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది. ఇక 2011లో రణ్ బీర్ కపూర్, నర్గిస్ ఫక్రీ నటించిర 'రాక్ స్టార్'లో సహనటి పాత్ర ద్వారా సంజనా సాంఘి బాలీవుడ్ లో కాలుమోపింది. ఆమె తాజా చిత్రం 'దిల్ బేచారా', ఈ నెల 24న ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: