టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ఏ వార్త వచ్చినా సరే దేశం మొత్తం కూడా కాస్త ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ అనుష్క తన మార్క్ వేస్తుంటే కోహ్లీ కూడా బ్యాట్ తో తాను ఏంటీ అనేది ప్రత్యర్ధులకు చూపిస్తున్నాడు. ఇక వీరు ఇద్దరి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వీరు ఇద్దరూ కెరీర్ లో బిజీ అవ్వడ౦ చూసి అసలు వీళ్ళు కలిసి ఉంటున్నారా డబ్బు సంపాధనేనా...? 

 

అంటూ చాలా మంది అప్పట్లో కామెంట్స్ కూడా చేసారు. తాజాగా దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వోగ్` మేగజీన్ కవర్ పేజీ‌పై ఆమె అందాలు ఆరబోసింది. ఈ నేపధ్యంలోనే తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. మా వివాహం జరిగిన తొలి ఆరు నెలల్లో విరాట్, నేను 21 రోజులే కలిసి గడిపామని ఆమె చెప్పింది. అవును నేను రోజులు లెక్క పెట్టేదాన్ని అని చెప్పుకొచ్చింది. మా ఇద్దరిలో ఎవరో ఒకరం వర్క్‌తో బిజీగా ఉండేవారమని పేర్కొంది. 

 

నేను అతణ్ని కలిసేందుకు విదేశాలకు వెళ్లినపుడు భోజనం కోసం బయటకు వెళ్లేవాళ్లమని పేర్కొంది. ఆ సమయాన్ని బాగా ఆస్వాదించేవాళ్లమని గుర్తు చేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇద్దరం కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నామ`ని అనుష్క సంతోషంగా చెప్పుకుంది. కాగా కోహ్లీ అనుష్క కలిసి ఒక బయోపిక్ ని సెట్స్ మీదకు తీసుకుని వస్తున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. నిజమా కాదా అనేది మాత్రం స్పష్టత లేదు. వీరు ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: