లాక్ డౌన్ లో ఇప్పుడు సినిమాల పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉంది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ లో సినిమా విడుదల చేయడం అనేది నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే చాలా కష్టం అనేది అర్ధమవుతుంది. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు ముందుకు వెళ్ళే ఆలోచనలో లేవు. ఇక అందుకే చాలా మంది హీరోలు తమ భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు సినిమాలను లైన్ లో పెడుతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. 

 

స్టార్ హీరోలు అందరూ కూడా రాబోయే రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టారు అని సినీ జనాలు అంటున్నారు. అవును స్టార్ హీరోలు అందరూ కూడా కెరీర్ కి ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి గానూ రాబోయే రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు దాదాపు పెద్ద పెద్ద  సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి అని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం కాస్త దూకుడుగా నిర్మాతలు ఆలోచనలు చేసినా కరోనా మాత్రం నానా రకాల ఇబ్బందులు పెడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న వార్తలు ఏంటీ అంటే మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా నాలుగేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రామ్ చరణ్ కూడా దాదాపు అదే విధంగా ఆలోచన చేస్తున్నాడు అని అంటున్నారు. మహేష్ బాబు అయితే నాలుగేళ్ళకు సరిపడా లైన్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. రామ్ చరణ్ బన్సాలి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్, కొరటాల, అనీల్ రావిపూడి ని లైన్ లో పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: