మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమ చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కూడా నటిస్తాడని తెలిసిందే. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రం, ప్రశాంత్ నీల్ ఇద్దరితో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎవరి సినిమా ముందు ఎవరి సినిమా తర్వాత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్సినిమా చేస్తాడన్న విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ట్రిపుల్ ఆర్ చేస్తూనే ఆచార్యలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. 

 

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ కొత్త దర్శకుడు సతీష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. సతీష్ రాసుకున్న కథ దిల్ రాజుకి బాగా నచ్చిందట. సభకు నమస్కారం టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా కోసం చరణ్ కు కథ వినిపించే ప్రత్నంలో ఉన్నారట. చరణ్ ఓకే అంటే సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్టే అంటున్నారు. అయితే చరణ్ లాంటి స్టార్ హీరో కొత్త దర్శకుడితో సినిమా అంటే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందన్నది చూడాలి.

 

రంగస్థలం తర్వాత భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ కాగా ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తర్వాత కూడా కథల విషయంలో చరణ్ జాగ్రత్త వహిస్తే బెటర్ అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ నిజంగానే సభకు నమస్కారం సినిమా చేస్తాడ.. దిల్ రాజు కాన్ ఫిడెంట్ గా ఉన్నాడంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే కాబట్టి చరణ్ ప్రొసీడ్ అవుతాడో లేదో చూడాలి. ఒకవేళ చరణ్ సతీష్ కు ఓకే చెబితే మాత్రం కుర్రాడు లక్ బాగున్నట్టే లెక్క.                        

మరింత సమాచారం తెలుసుకోండి: