సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత మెంటల్ హెల్త్ విషయంలో కూడా భారీగా ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టార్ తనకు ఆత్మహత్య చేసుకోవాలనుందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయటం సంచనలంగా మారింది. ప్రముఖ బోజ్పురి నటి సబినా షేక్ తనకు వస్తున్న వేదింపుల సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
రాణీ చటర్జీగా పాపులర్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ సూపర్ హిట్ టెలివిజన్ షో ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 10లో పాల్గొంది. `గత కొన్నేళ్లుగా డిప్రెషన్లో ఇబ్బంది పడుతున్న నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. దీన్ని నేను ఇక ఎంత మాత్రం భరించలేను` అంటూ సుసైడ్ అనే హ్యాష్ ట్యాగ్తో తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓ పోస్ట్ చేసింది.
ధనుంజయ్ సింగ్ అనే ఫేస్బుక్ యూజర్ కొంత కాలంగా తనను ఎలా వేదిస్తున్నాడో వివరించింది రాణీ. తన శరీరం గురించి అభ్యంతరకర కామెంట్లు పెడుతూ వేదిస్తున్నాడని ఆమె తెలిపింది. ఇలా తనకు ఎదురైన అనుభావాలను వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టుగా చెప్పింది. ఆ పోస్ట్ లోనే తాను ఈ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటే దానికి ధనుంజయ్ సింగే కారణం అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది.