టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే మన తెలుగు లో ఉన్న కొందరికి మంచి ఇమేజ్ ఉంది. అందులో హీరోయిన్ లు కూడా ఉన్నారు.  పూజ హెగ్డే కి బాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలను జనాలు బాగానే బాలీవుడ్ లో ఆదరించే పరిస్థితి అయితే ఉంది అని చెప్పవచ్చు. ఇక ఆమె కూడా తనకు వచ్చిన క్రేజ్ ని  బాగానే బాలీవుడ్ లో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె తెలుగు లో రెండు సినిమాలను ప్లాన్ చేసారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆ  రెండు సినిమాలు దాదాపుగా ఆగిపోయాయి. 

 

ఇక ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్  అని సమాచారం. అనుష్క శర్మ నిర్మాతగా చేస్తున్న ఒక సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. నిజమా కాదా అనేది చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి. ఇక్కడ అసలు విషయం  ఏంటి అంటే ఈ సినిమాలో ఆమె రేప్ కి గురైన ఒక బాలిక పాత్రలో నటిస్తుంది అని సమాచారం. ఆ తర్వాత ఆమె పడే ఇబ్బందులను ఆ సినిమాలో చూపించే అవకాశం ఉందని ఆ  ప్రాజెక్ట్ ని త్వరలోనే అనుష్క లాంచ్ చేస్తుంది అంటున్నారు. 

 

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే తన పాత్రలో ఆమె నటించడానికి  కాస్త పూజ వెనకడుగు వేసింది అని సమాచారం. ఆమె పాత్రలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చూడాలి అసల ఎం జరుగుతుంది మరి అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: