టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా తరువాత కొంత బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్, ఎట్టకేలకు ఇటీవల తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాటని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. లాక్ డౌన్ ముగిసిన అనంతరం జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనుండగా, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. 

IHG

ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం ఇప్పటికే పలువురిని సంప్రదించిన సినిమా యూనిట్, ఫైనల్ గా కన్నడ నటుడు సుదీప్ ని ఇటీవల సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడ మరొక సినిమా చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లాక్ డౌన్ అనంతరం అతి త్వరలో ఈ రెండు సినిమాల పెండింగ్ షూటింగ్ ముగించి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా వకీల్ సాబ్ ఎనభై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకోగా, క్రిష్ తో చేస్తున్న సినిమా నలభై శాతం షూటింగ్ ఇప్పటివరకు వరకు జరుపుకున్నట్లు చెప్తున్నారు. ఇకపోతే వీటి రెండిటి తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాని హరీష్ మంచి పవర్ఫుల్ కథతో తెరకెక్కించనున్నారు. 

 

కాగా ఈ సినిమాకు సంబందించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వర్క్ ఇప్పటికే ఆరంభం అయిందని, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాలో విలన్ గా సుదీప్ ని అనుకుంటున్నాడట దర్శకుడు హరీష్. కథ రీత్యా విలన్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, ఆ విధమైన క్యారెక్టర్ కు సుదీప్ అయితేనే బెస్ట్ అని భావించి రెండు రోజుల క్రితం అతడిని సంప్రదించినట్లు చెప్తున్నారు. ఈ విధంగా అటు మహేష్ సినిమాతో పాటు , అటు పవన్ సినిమాలో కూడా విలన్ గా సుదీప్ సెలెక్ట్ అయినట్లు తాజా న్యూస్. అయితే ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై రెండు సినిమాల యూనిట్స్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: