సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కే ఈ సినిమాలో పుష్ప రాజ్ కు ఇద్దరు అన్నలు ఉంటారట. వాళ్లంటే పుష్ప రాజ్ కు చాలా ఇష్టమట. అందులో ఒక బ్రదర్ సర్పంచ్ గా కనిపిస్తాడట. రంగస్థలం లానే పుష్ప సినిమాలో కూడా పొలిటికల్ టచ్ తో కూడా కథను రాసుకున్నాడు సుకుమార్.

 

అన్న సర్పంచ్ ను చూసే పుష్ప రాజ్ రెచ్చిపోతాడాని అంటున్నారు. అల వైకుంఠపురములో సక్సెస్ తో బన్ని, రంగథలం సక్సెస్ తో సుకుమార్ ఇద్దారు కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇదే కాకుండా మరిన్ని సర్ ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది. సుక్కు సినిమా హిట్టైతే బాక్సులు బద్ధలు కొట్టాల్సిందే అన్నట్టుగా రంగస్థలంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. అంతేకాదు చరణ్ లోని కొత్త నటుడిని ఆవిష్కరించిన సినిమాగా రంగస్థలం  సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

 

అప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్ని రంగస్థలం బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు పుష్పతో మళ్లీ మరో సెన్సేషనల్ హిట్ కు ప్రయత్నిస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ ఇద్ద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. మరి ఈ సినిమా  ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మొదటి షెడ్యూల్ కేరళ అడవుల్లో చేయగా కరోనా వల్ల తర్వాత షెడ్యూల్ అక్కడ చేసే వీలు లేదని భద్రాచలం, మారేడిమిల్లి ప్రాంతంలో పుష్ప షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: