సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నుండి సర్కారు వారి పాట సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్తర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ చాలా స్టైలిష్ గా చూపించబోతున్న పరశురామ్ సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ హంగులని జతపర్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 

IHG

అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. అక్టోబర్ నెలలో మహేష్ షూటింగ్ కి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం  ఇంటిదగ్గరే ఉంటున్న మహేష్, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. తన పిల్లలతో సరదాగా గడుపుతున్న ఫోటోలని అభిమానులతో పంచుకుంటూ, అప్పుడప్పుడు లైవ్ టాక్ షో ద్వారా టచ్ లోకి వస్తున్నాడు. 

 

అయితే సినిమాల ద్వారా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే మహేష్ బాబు, సోషల్ మీడియాలోనూ తనదైన రికార్డు సాధించాడు. మహేష్ బాబు ని ట్విట్టర్ ద్వారా ఫాలో అయ్యేవారు పది మిలియన్లకి చేరువయ్యారు. అంటే ట్విట్టర్ ద్వారా మహేష్ చెప్పే మాటలు కోటిమందికి చేరుతాయన్నమాట. ఇప్పటి వరకూ ఏ దక్షిణాది హీరోకి ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేరు. ట్విట్టర్ లో కోటి మంది ఫాలోవర్లని దక్కించుకున్న మొదటి సౌత్ హీరోగా మహేష్ బాబు రికార్డు సాధించాడు.

 

ప్రస్తుతం పరశురామ్ తో సినిమా చేస్తున్న మహేష్, ఆ తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఈ మేరకు రాజమౌళి ప్రకటన కూడా చేసాడు. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి మూవీ తెరకెక్కనుందో చూడాలి. రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: