దాదాపు సంవత్సరం క్రితం స్టైలిష్ స్టార్ బన్నీ మరియు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో 'సభకు నమస్కారం' అనే సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటం జరిగింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ మరో ప్రాజెక్టులపై దృష్టి పెడుతూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల లాక్ డౌన్ టైములో ఆ స్క్రిప్ట్ మరొకసారి ఫైనల్ చేసే పనిలో భాగంగా కొత్త రైటర్ సతీష్ స్క్రిప్టు మొత్తం చేంజ్ చేసి దిల్ రాజు కి వినిపించడం జరిగిందట. మొదటి సారి కంటే రెండో సారి అద్భుతరీతిలో ఉండటంతో వెంటనే దిల్ రాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది మొదటి లో తన బ్యానర్ లో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

 

పక్కా మాస్ ఎంటర్టైనర్ తరహా కలిగిన ఈ సినిమా స్క్రిప్ట్ లో మొదటిలో అల్లు అర్జున్ అనుకున్న ఆ ప్లేస్ ని ప్రజెంట్ రామ్ చరణ్ రీప్లేస్ చేసినట్లు, వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ విన్న వెంటనే దిల్ రాజు… ఈ సినిమాలో చరణ్ అయితే బాగుంటుందని చరణ్ తో సంప్రదింపులు  జరపగా, స్టోరీ నచ్చడంతో రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి మొదటిసారి అనుకున్న ‘సభకునమస్కారం’ అనే టైటిల్ నే ఖరారు చేశారట.

 

ఇటువంటి తరుణంలో సినిమా డైరెక్టర్ విషయంలో  కొత్తవాడైనా సతీష్ కి ఇస్తారా లేకపోతే  మరెవరికైనా డైరెక్టర్ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాజమౌళి మరియు కొరటాల సినిమా తర్వాత రామ్ చరణ్సినిమా చేయనున్నట్లు సమాచారం. కరోనా  వైరస్ లాక్ డౌన్ సమస్యలు అంతా సెట్ అయిన తర్వాత సినిమా థియేటర్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చిన తరువాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: