బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం నుండి బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని రిలీజైన ఫస్ట్ రోర్ కి మంచి స్పందన వచ్చింది. అప్పటి వరకూ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా ఫస్ట్ రోర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసాడు. రూలర్ సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో మళ్లీ హిట్ అందుకుంటాడని ఆశిస్తున్నారు.

 


అయితే బోయపాటి తర్వాత బాలయ్య, సీనియర్ దర్శకుడితో చేతులు కలపనున్నాడని టాక్ వినబడుతుంది. గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమాల్లో కొత్తదనం ఉండట్లేదన్న విమర్శలు బాగా వచ్చాయి. పాతతరం కథల్నే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా జై సింహా, రూలర్ సినిమాల టైమ్ లో ఇలాంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. ఇప్పటి దర్శకులతో బాలయ్య సినిమా చేయాలని భావించారు.

 

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య మరో మారు సీనియర్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాడు. బాలయ్య కెరీర్లో సంచలన విజయాలని అందించిన బీ గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని టాక్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే కానీ బీ గోపాల్ ప్రస్తుతం సినిమాలు చేయట్లేదు.

 

ఆరడుగుల బుల్లెట్ సినిమా తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఆ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ కాలేదు. మరి బాలయ్య మరోసారి రిస్క్ చేస్తున్నాడా లేదా క్రేజీ కాంబినేషన్లో మళ్ళీ హిట్ సాధిస్తారా అన్నది చూడాలి. అయితే ఈ సినిమాకి కథ, మాటలు సాయిమాధవ్ బుర్రా అందించనున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా విషయమై అధికారికంగా ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: