చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల విడుదలైన సైరా సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతుంది.. ఇప్పటికే షూటింగ్ పనులు పూజ కార్యక్రమాలతో మొదలయ్యాయి. లాక్  డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది.. మరి కొద్ది రోజుల్లో సినిమా పునః ప్రారంభం కానుంది. 

 

 

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి గట్టి పోటీ నీ ఇచ్చే విలన్ పాత్రను హైలెట్ గా చూపించడానికి కొరటాల ప్రయత్నిస్తున్నాడు.. అందుకోసం జగపతి బాబు ను సంప్రదించినట్లు సమాచారం.అప్పటిలో ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు శోభన్ బాబుకు ప్రత్యామ్నాయంగా నిలిచి.. విజయాలు సాధించిన జగపతిబాబు, తరం మారడంతో విలన్ పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సంగతి విదితమే. అంతేకాదు .. ప్రస్తుతం తెలుగు సినిమాలలో బెస్ట్ విలన్ అంటే వినపడే పేరు జగపతి బాబు.పలు చిత్రాలలో పవర్ ఫుల్ పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకు చాలా వాటిలో ఆయన విలన్ తరహా పాత్రలలో నటిస్తున్నారు. 

 

 

ఈ కోవలో తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమాలో కూడా ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది.మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయ్యాక 'లూసిఫర్' రీమేక్ చిత్రాన్ని సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.. మరి ఈ రెండు సినిమాలు చిరు కు ఏ మాత్రం హిట్ ని ఇస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: