టాలీవుడ్ లో ఇప్పుడు కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ గా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం మూడు సినిమాలకు గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలలో ఒకటి ఆమె సోలో గా చేస్తూ ఉండగా మరో రెండు సినిమాలు ఒకటి మహేష్ తో మరొకటి నితిన్ తో ఆమె చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ గా ఉన్నాయి. 

 

ఈ రెండు సినిమాల తర్వాత ఆమె తమిళం లో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఆమె టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే'లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో పాటుగా ఆమె మరో సినిమాలో కూడా నటిస్తుంది అని సమాచారం. ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో ఆమె ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

నితిన్ తర్వాత మూడు సినిమాలు చేస్తూ ఉండగా అందులో ఒకటి వెంకీ అట్లూరి తో చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా కీర్తి నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం. ఆయన 'పవర్ పేట' సినిమాలో కూడా కీర్తి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి మరి. తెలుగులో గుడ్ లక్ సఖీతో పాటు మిస్ ఇండియా సినిమాల్లో కీర్తి నటిస్తోంది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమాలో ఆమె నటిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: