టాలీవుడ్ లో క్రేజీ ప్రొడక్షన్ హౌజ్ గా పేరు తెచ్చుకున్న యువి క్రియేషన్స్ మిర్చి సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగారు. ఆ తర్వాత రన్ రాజా రన్ హిట్ కొట్టగా ఇక తర్వాత నుండి గీతా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ప్రభాస్ తో సాహో నిర్మించిన యువి క్రియేషన్స్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాను కూడా వారే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ మీడియం బడ్జెట్ సినిమాలనే నిర్మించాలని చూస్తున్నారు.

 

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం వల్ల ఎంత క్రేజ్ ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే యువి క్రియేషన్స్ ప్లాన్ చేంజ్ చేసి కేవలం మినిమం, మీడియం బడ్జెట్ సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే స్టార్ హీరో రాం చరణ్ డేట్స్ వారి దగ్గర ఉన్నాయి. అయితే చరణ్ తో చేసే సినిమాకు ఇంకా చాలా టైం ఉండేలా కనిపిస్తుంది. ఇక మారుతి డైరక్షన్ లో ఓ మీడియం బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయట.

 

మొత్తానికి సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన నిర్మతాలు ఇప్పుడు వారి ప్లాన్ మార్చేసి మీడియం బడ్జెట్ సినిమాల మీద కన్నేశారు. మినిమం, మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తే థియేటర్ రిలీజ్ కష్టమైనా ఓటిటిలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే యువి వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు చేయాలని అనుకున్నా సరే గీతా ఆర్ట్స్ తో కలిసి భాగస్వామ్యం అయ్యి చేయడమే కాని సొంతంగా చేసే ఆలోచన లేదన్నట్టు తెలుస్తుంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: