టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి ముందుగా నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందంలో నటించి మరొక సూపర్ హిట్ ని దక్కించించుకుని ఎందరో అభిమానులను సంపాదించింది. అక్కడి నుండి వరుసగా అవకాశాలు పట్టిన ఈ అమ్మడు, ఈ ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరులో నటించి సూపర్ హిట్ కొట్టి, ఆ వెంటనే నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ లో నటించి తద్వారా మరొక విజయాన్ని అందుకున్నారు. 

IHG's ...

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప లో హీరోయిన్ గా నటిస్తున్నారు. దానితో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తున్న రష్మికకు ఇటీవల ఒక బడా టాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నేళ్ళ క్రితం తమ కాంబోలో ఒక సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టార్ హీరో, బడా డైరెక్టర్ ఇద్దరూ కూడా మరికొద్దిరోజుల్లో వారి తదుపరి సినిమా చేయనున్నారు. ఇటీవల దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. 

 

అయితే ముందుగా ఆ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రష్మిక నే వరించిందని, అయితే సినిమా కథ, తన క్యారెక్టర్ విన్న రష్మిక, కొంత సమయం అడిగిందని, ఆ తరువాత వారి నుండి సమాచారం రాకపోవడంతో అసలు ఏమి జరిగిందని తెలుసుకోగా, ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని ఎంపిక చేసారని తెలిసిందట. ఆ విధంగా ఆ బడా మూవీలో ఆమెకు ఛాన్స్ అలా వచ్చి ఇలా చేజారడంతో ఆమె కొంత ఫీల్ అవుతోందని అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావలసి ఉందని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: