హీరోయిన్స్ గా సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత కొందరు మెల్లగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగి, ఆపై కొన్నేళ్ల తరువాత తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్న అనంతరం ఫ్యామిలీ జీవితంలో స్థిరపడుతుంటారు. ఇక మరికొందరు అయితే కొంత ఫ్యామిలీ లైఫ్ గడిపిన తరువాత మళ్ళి మధ్యలో సినిమాల్లోకి ప్రవేశించి పలు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తుంటారు. అయితే ఇటువంటి వారందరికీ కొంత భిన్నంగా హీరోయిన్ గా, ఆపై నిర్మాతగాకొనసాగుతున్నారు. ముందుగా నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన పంజాబీ భామ ఛార్మి కౌర్, తొలి సినిమా నుండి తన అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. 

IHG

ఆ తరువాత నుండి కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకున్న ఛార్మి, మధ్యలో మంచి సక్సెస్ లతో పాటు కొంత ఫ్లాప్స్ కూడా చవిచూడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందుకు సాగిన ఛార్మి, మధ్యలో అక్కడక్కడ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నటించారు. అయితే ఆపై కొంత ఆలోచన చేసిన ఛార్మి, తాను ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాతో నిర్మాతగా మారారు. ఇక అక్కడి నుండి పూరి తీస్తున్న ప్రతి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న ఛార్మి, ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

 

ఇకపోతే కాసేపటి క్రితం తన పదహారేళ్ళ వయసు నాటి ఫోటోలను పోస్ట్ చేస్తూ అప్పటి కాలాన్ని నెమరువేసుకున్న ఛార్మి, ఆ రోజులు మళ్ళి రావంటూ ఒక పోస్ట్ చేసారు. పదహారేళ్ళ వయసులో ఎంతో అందంగా చూడచక్కని చందమామలా ఉన్న ఛార్మి ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్, ఆ వయసులో ఇంత అందంగా ఉన్నారేంటండి బాబూ అంటూ సరదాగా వాటిపై కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: