దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజమౌళి తమన్నా ని ప్రకటించగానే ఇంత పెద్ద భారీ సినిమాలో తమన్నాకి ఎలాంటి పాత్ర ఇచ్చుంటారు...తమన్నా ఎలా చేసుంటుంది.. అంటూ మాట్లాడుకున్నారు. కాని బాహుబలి బిగినింగ్ లో తమన్నా చేసిన ఫైట్స్, ప్రభాస్ తో రొమాన్స్ చూసిన ప్రేక్షకులందరు తమన్నా తో పాటు రాజమౌళి మీద పొగడ్తల వర్షం కురిపించారు. 

 

అంత అధ్భుతంగా రాజమౌళి తమన్నాని చూపించాడు. అయితే రీసెంట్ గా ఈ విషయం లో స్పందించింది మిల్కీ బ్యూటీ. జక్కన్న పై తన అభిమానాన్ని చూపిస్తూ ప్రేమతో ప్రశంసల వర్షం కురిపిస్తుంది తమన్నా. బాహుబలి సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేసింది. కాని ఫస్ట్ పార్ట్ లో తమన్నాదే కీలక పాత్ర అన్నది తెలిసిందే. ఇటీవల ఒక సందర్భంలో రాజమౌళి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చినందుకు జక్కన్న కి తమన్నా ధన్యవాదాలు తెలిపింది.

 

అంతేకాదు రాజమౌళి ఒకసారి తన సినిమాలో నటించారు కదా అని నటీనటులకు మళ్ళీ అవకాశం ఇవ్వరు. ఆయన అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్‌గా సరిపోతారని అనుకుంటారో వాళ్ళకే రాజమౌళి అవకాశం ఇస్తారని తమన్నా తెలిపింది. ఎవరికైనా రాజమౌళి దగ్గరి నుంచి ఫోన్ వచ్చిందంటే.. ఆ పాత్ర కచ్చితంగా వారికి రాసినట్లే అని తమన్నా క్లారిటి ఇచ్చారు. అంటే రాజమౌళి ఒక పాత్రని ఎంచుకునేటప్పుడు ఎంతగా ఆలోచిస్తారో ఎంత ఖచ్చితంగా ఉంటారో తమన్నా మాటలని బట్టి అర్థమవుతోంది.

 

ఇక ప్రస్తుతం తమన్నా గోపిచంద్‌ సరసన సిటీమార్‌లో, హిందీలో నవాజుద్దీన్ సరసన బోలే చుడియాన్‌లో నటిస్తుంది. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం వ్యాఖ్యాతగాను మారబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: