టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, ఇంకా అదే సినిమా షూటింగ్ లో కొనసాగుతున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

IHG

ఇకపోతే ఈ సినిమా తరువాత మరొక్కసారి త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. దాని తాలూకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇటీవల రావడం జరిగింది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కోసం ప్రశాంత్ ఇప్పటికే మంచి స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక పక్కా మాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ని చాలావరకు కంప్లీట్ చేసిన ప్రశాంత్, అతి త్వరలో అది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా మిగతా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడం పైనే కూర్చుంటారని అంటున్నారు. 

 

ప్రశాంత్ వ్యూ ప్రకారం ఎన్టీఆర్ ని ఎవరూ ఊహించని రేంజ్ లో చూపించాలని ఉందని, అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ఈ కథను సిద్ధం చేయడం జరుగుతోందట. ఎంతో భారీ లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ని ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ పూర్తి అయిన అనంతరం మొదలెట్టనున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్తే అని చెప్పకతప్పదు....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: