టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి జాన్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రభాస్ సరసన పూజ హెగ్డే జోడి కడుతున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఈ సినిమాని ఎంతో భారీ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఇప్పటికే యూనిట్ వారు పనులు మొదలెట్టినట్లు సమాచారం.

IHG's next?

కొన్నేళ్ల క్రితం యూరోప్ దేశంలో జరిగిన రెట్రో ప్రేమకథగా పలు ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈపాటికి రిలీజ్ కావలసి ఉండగా, కరోనా తో ఏర్పడ్డ లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా దానిని మరికొద్దిరోజుల పాటు వాయిదా వేశారు నిర్మాతలు. కాగా కొద్దిరోజుల నుండి ఈ సినిమా విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

దాదాపుగా అన్ని సినిమాలు కూడా తమ సినిమాల తాలూకు టైటిల్ లేదా పోస్టర్స్ అనౌన్స్మెంట్ వంటివి చేస్తున్నాయని, కానీ తమ హీరో ప్రభాస్ సినిమా నిర్మాతలు మాత్రం ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు సినిమా షూటింగ్ అయిపోయిందని చెప్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఈ సినిమా మిగతా షూటింగ్ ని సకాలంలో పూర్తి చేసుకుని ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ సినిమా నిర్మాతలు ఏ విధంగా కూల్ చేస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: