హిట్ పెయిర్ అనేది ఒక సెంటిమెంటే కాదు.. అదొక కిక్. కెమిస్ట్రీనే కాదు అన్నీ కలిసొస్తాయన్న నమ్మకం బలంగా ఉంటుంది. అందుకే అభిమానులు రిపీట్ కాంబినేషన్స్ కోరుకుంటారు. తెలుగులో ప్రస్తుతం ఐదారు రిపీట్ కాంబినేషన్స్ రూపొందుతున్నాయి. 

 

తెలుగులో హిట్ కాంబినేషన్స్ మాట్లాడాల్సి వస్తే.. ముందు సమంత, నాగచైతన్య గురించే మాట్లాడాలి. నాగచైతన్య సక్సెస్ ను సమంత నీడలా వెంటాడుతోంది. జోష్ తో హీరోగా పరిచయమైన చైతు.. రెండో సినిమా ఏమాయ చేసావేతో తొలి హిట్ అందుకున్నాడు. సమంతకు ఇది తొలి సినిమా. 

 

సమంత, చైతు కాంబోలో నాలుగు సినిమాలు వస్తే.. అందులో మూడు హిట్ అయ్యాయి. ఆటోనగర్ సూర్య మినహా.. ఏమాయ చేసావె.. మనం.. మజిలీ హిట్ అయ్యాయి. సమంతతో నటించిన సినిమాలు నాగచైతన్య కెరీర్ కు చాలా ఉపయోగపడ్డాయి. ఈ హిట్ పెయిర్ ఐదోసారి కనువిందు చేయనుంది. మనం తర్వాత నాగచైతన్య, సమంత.. విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. 

 

బలుపు మూవీతో హిట్ పెయిర్ అనిపించుకున్న రవితేజ, శృతిహాసన్ ప్రస్తుతం క్రాక్ మూవీ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత శృతి నటిస్తున్న తొలి సినిమా ఇదే. సకెండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శృతి తనకు కలిసొచ్చిన హీరోనే నమ్ముకుంది. 

 

ఎంసిఎలో నాని, సాయిపల్లవి కెమిస్ట్రీ గురించి చెప్పనక్కర్లేదు. పాటల్లో.. సీన్స్ లో పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ఈ జంట మరోసారి జత కడుతోంది. నాని టాక్సీవాలా దర్శకుడు సంకృత్యన్ డైరెక్షన్ లో శ్యాం సింగ్ రాయ్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. 

 

ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత చిరంజీవి, కాజల్ కాంబోలో ఆచార్య రూపొందుతోంది. ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ గా చాలామంది అనుకున్నా కుదర్లేదు. ఎవరూ దొరక్క చివరి ఛాయిస్ గా కాజల్ ను ఎంచుకున్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మూవీలో హీరోయిన్ గా త్రిషను ఎంచుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా త్రిష తప్పుకోవడంతో.. ఆఫర్ కాజల్ ను వరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: