గడచిన రెండేళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఎట్టకేలకు ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ కొట్టి, ఆయనకు మంచి బ్రేక్ నివ్వడంతో పాటు మరింత గొప్ప మార్కెట్ ని క్రియేట్ చేసింది. ఇక దాని తరువాత సూపర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించడానికి సిద్ధం అయ్యారు అల్లు అర్జున్. ఇటీవల శేషాచలం అడవుల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఎలాగైనా మంచి హిట్ సాధించేలా దర్శకుడు సుకుమార్ ఎంతో పక్కాగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. 

IHG'Rangasthalam' shines

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా పక్కా మాస్ క్యారెక్టర్ల లో కనపడనున్న ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని చూశాడట దర్శకుడు సుకుమార్. ఇటీవల తాను తీసిన రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో ఎంతో గొప్ప సహజత్వ నటన కనబరిచిన సమంత అయితేనే ఈ సినిమాలో హీరోయిన్ క్యరెక్టర్ కి సరిపోతుందని భావించి ఆమెను సంప్రదించి కథ వివరించగా, మొన్న నేను చేసిన రంగస్థలం మాదిరిగా ఈ సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ మాస్ స్టైల్ లోనే ఉందని, ఒకసారి తాను చేసిన అటువంటి పాత్రని మరొక్కసారి చేయలేనని, ఆ అఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట సమంత. 

 

అనంతరం ఆమె స్థానంలో రష్మికకు స్టోరీ వివరించిన సుకుమార్, ఆమె ఒప్పుకోవడంతో హీరోయిన్ గా ఫైనల్ గా ఆమెను ఎంపిక చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంపికకు సంబంధించి అసలు కథ ఇదే అంటూ ఈ మ్యాటర్ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంతరవరకు నిజానిజాలు ఉన్నాయో వెల్లడికావలసి ఉంది....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: