యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే ఈమధ్య తారక్ బర్త్ డే రోజున ప్రశాంత్ నీల్ విష్ చేశాడు. కెజిఎఫ్ సినిమాతో సౌత్ ను షేక్ చేయడమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు ప్రశాంత్ నీల్.

 

ఇక ఈ సినిమా చాప్టర్ 2 తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాన్ నీల్. ఇదిలాఉంటే ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ చేయబోయే సినిమాకు సంబందించిన క్యారక్టర్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సినిమాలో తారక్ ఊర మాస్ లుక్ తో అలరిస్తాడట. అంతకుముందు ఎలాంటి ఇమేజ్ లేని యశ్ కు కెజిఎఫ్ తో అదరగొట్టగా చాప్టర్ 2 ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక తారక్ తో చేసే సినిమా కూడా భారీ రేంజ్ లో తెరకెక్క్స్తారని తెలుస్తుంది.

 

ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో దుమ్ముదులపబోతున్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాకు రేడిషేస్యన్ టైటిల్ పరిశీలనలో ఉందట. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: