మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ పై సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన లిరికల్ వీడియో సాంగ్ నీ కన్ను నీలి సముద్రం మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులలోకి దూసుకు పోయింది. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా కృతీ శెట్టి నటిస్తుంది.

 

అయితే ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాని కరోనా వల్ల ఉప్పెన రిలీజ్ ఆగిపోయింది. లాక్ డౌన్ తో థియోటర్స్ మూతపడి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగా 'ఉప్పెన' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దర్శక నిర్మాతలు ఈ విషయంలో రీసెంట్ గా క్లారిటీ ఇస్తూ మెగా హీరో డెబ్యూ మూవీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటీటీ లో రిలీజ్ చేసే ఆలోచనే లేదని చెప్పారు.

 

ఇక 'ఉప్పెన' సినిమాని దాదాపు 20 కోట్లు బడ్జెట్ తో నిర్మించారట. అయితే 2020 లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ మెగా హీరో కి 2020 కలిసి రాదనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చెప్పాలంటే మెగా హీరో రీ ఎంట్రీ కే కాదు చాలా సినిమాలకి 2020 బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయేలానే ఉంది. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఇన్నేళ్ళలో ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కి తమ్ముడైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: