లాక్ డౌన్ వల్ల థియేటర్స్ బంద్ కావడం.. కొత్త సినిమాలు చూసే అవకాశం లేకుండాపోయింది. ఓటిటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి అందరికి అందుబాటులో లేకుండాపోతుంది. ఇక టివిల్లో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఎప్పటినుండో వస్తున్న సినిమాలైనా సరే ఈసారి ఎక్కువ మంది చూసి అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ వచ్చేలా చేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ తమిళ డబ్బింగ్ సినిమాకు ఇలానే అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ వచ్చేలా చేశారు. ఆ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లిందో ఎవరికి తెలియదు.

 

కోలీవుడ్ లో ధనుష్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా రైల్. తమిళ సినిమానే అయినా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా రిలీజైన టైంలో అసలు దీన్ని పట్టించుకోలేదు. కొంతమందికి ఈ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అయితే స్టార్ మా ఈమధ్య ఈ సినిమాను టెలికాస్ట్ చేసింది. ఆల్రెడీ అమేజాన్, యూట్యూబ్ రెండిటిలో ఫుల్ సినిమా ఉంది. అయినా కూడా 4.91 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఎంత కరువులో ఉన్నారో ఈ సినిమా టి.ఆర్.పి రేటింగ్ చూసి చెప్పొచ్చు.

 

ఇంతకీ సినిమా కథ ఏంటి అంటే ట్రైన్ లో ప్యాంట్రీలో పనిచేసే ధనుష్.. అదే ట్రైన్ లో సినిమా ఛాన్సుల కోసం వెళ్తున్న కీర్తి సురేష్.. ఈ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ.. మధ్యలో ట్రైన్ డ్రైవర్ లేకుండా స్పీడ్ గా వెళ్తుంది. పోలీసులు హీరోయిన్ ను ఉగ్రవాదిగా భావిస్తారు. తర్వాత సినిమా సస్పెన్స్ గా తీసుకెళ్లారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాని స్టార్ మాలో మాత్రం మంచి టి.ఆర్.పి తెచ్చుకుంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: