సినీ పరిశ్రమలో ఏ హీరోకి ఎప్పుడు కెరియర్ టర్న్ అవుతుందో చెప్పలేం. కొందరు దశాబ్ధ కాలంగా హిట్ల కోసం తపించిపోతుంటే కొందరు మాత్రం సింపుల్ కథతో వచ్చి సూపర్ హిట్లు కొడతారు. ఇక కొందరికి మాస్ ఇమేజ్ వచ్చినా సరే దాన్ని వినియోగించుకోలేదు. అందులో ముందుగా చెప్పాలంటే హీరో గోపిచంద్ వస్తాడు. డైరక్టర్ టి.కృష్ణ తనయుడిగా తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ ఆ తర్వాత విలన్ గా మారాడు. ఇక విలన్ గా సక్సెస్ అయిన గోపిచంద్ మళ్లీ యజ్ఞంతో హీరోగా టర్న్ తీసుకున్నాడు.

 

అప్పటినుండి మాస్ ఆడియెన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ కెరియర్ సాఫీగానే సాగింది. అయితే ఈమధ్య కొన్నాళ్లుగా గోపిచంద్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ అవట్లేదు. ఎంత ప్రయత్నించినా సరే హిట్టుకి దూరంగా ఉంటున్నాడు గోపిచంద్. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే గోపిచంద్ ఎక్కడో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే లజిక్ మిస్ అవుతున్నాడు. అందుకే అతని సినిమాల మీద ఆడియెన్స్ ఫోకస్ తగ్గిపోయింది.

 

ఇదివరకు గోపిచంద్ సినిమా అంటే కొద్దిగా ఎక్సయిట్మెంట్ ఉండేది ఇప్పుడు వరుస ఫ్లాపులతో వెనకపడటంతో అతని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి.. ఎప్పుడు వెళ్తున్నాయి అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది డైరక్షన్ లో సీటిమార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 

 

సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నాడు గోపిచంద్. కెరియర్ లో పూరి జగనాథ్ లాంటి స్టార్ డైరక్టర్ తో మాత్రమే గోలిమార్ సినిమా చేశాడు గోపిచంద్. మిగతా సినిమాలన్ని కొత్త వాళ్లతోనే చేశాడు. ఒకవేళ స్టార్ డైరక్టర్ చేతిలో పడి ఉంటే గోపిచంద్ కెరియర్ వేరేలా ఉండేదేమో.. వినాయక్, బోయపాటి సినిమాలు చేసుంటే గోపిచంద్ లెక్క వేరేలా ఉండేదని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: