కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు వారసులుగా ఇండస్ట్రీకి ముగ్గురు వారసులు పరిచయం అయ్యారు. మంచు విష్ణు, మనోజ్‌ లతో పాటు కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా నటిగా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే వీరిలో ఒక్కరు కూడా టాప్‌స్టార్ అనే స్థాయిలో ఇమేజ్‌ అందుకోలేకపోయారు. దీంతో అడపాదడపా సినిమాలు చేయటం తప్ప ఫుల్ ఫాంలో హీరోలుగా కొనసాగటం లేదు. 

 

మనోజ్‌ అయితే తెర మీద కనిపించి చాలా కాలమే అయ్యింది. విష్ణు కూడా హీరోగా ఆకట్టుకుంటున్నా స్టార్ హీరో అనే స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ క్రాస్‌ ఓవర్ మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు విష్ణు. హాలీవుడ్‌ దర్శకులతో కలిసి ఇండియాలో జరిగిన అతి పెద్ద సైబర్‌ స్కాంకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 

కాజల్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బహుభాష చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. ఈ యంగ్ హీరో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు విష్ణు. కొడుకు అవ్రమ్‌తో కలిసి సినిమా ఎడిటెడ్‌ వర్షన్‌ను చూస్తున్నా అని వెల్లడించాడు విష్ణు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Avram and I watching the edit of #Mosagallu ..Can you guess who’s on the screen?

A post shared by vishnu Manchu (@vishnumanchu) on

మరింత సమాచారం తెలుసుకోండి: