అక్కినేని నాగ చైతన్య సమంత కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏం మాయ చేశావే. ఈ సినిమాతోనే సమంత చైతూ ప్రేమలోనూ పడ్డారు. ఇక ఈ సినిమా తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాలు చేశారు. నాగ చైతన్య సమంతసినిమా చేసిన ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ తో పాటు ముద్దు కూడా ఉండాల్సిందే. అది సెంటిమెంట్ గాను మారిపోయింది. ఇద్దరు సినిమాలో ముద్దు పెట్టుకున్నారంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ వచ్చేసింది. ఈ విషయం సమంత కూడా సరదాగా వెల్లడించింది.

 

అయితే ఈ జంట పెళ్ళి చేసుకున్నాక కలిసి మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలబడుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలలో టాప్ టెన్ లో నిలబడే సినిమా. ఇక ఈ సినిమా తర్వాత సమంత ఓ బేబీ, జాను సినిమాలు చేసింది. వాటిలో ఒక సినిమా హిట్ అవగా ఒక సినిమా డిజాస్టర్ గా మిగిలింది. చైతూ మాత్రం మజిలీ తర్వాత మళ్ళీ సినిమా రాలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు.

 

సినిమా తర్వాత విక్రం కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ని అనుకుంటున్నాడట విక్రం కుమార్. మరి ఈ విషయం ఎంత వరకు నిజమో చైతూ గాని, విక్రం కుమార్ గాని అఫీషియల్ గా వెల్లడిస్తే గాని నమ్మలేము. ఇక మరోసారి శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ సమంత కలిసి నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి నుంచి ఎక్కువగా చైతూ సమంత కలిసి నటించే విధంగానే కథలు సిద్దం చేయమని దర్శకులకి చెబుతున్నారట. ఇక సమంత పెళ్ళి తర్వాత పూర్తిగా గ్లామర్ పాత్రలు చేయడం మానేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: