టాలీవుడ్ లో ఇప్పుడు కీర్తి సురేష్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ముందుంది. ఈ రేస్ లో మొన్నటి వరకు పూజా హెగ్డే..రష్మిక మందన్న ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరిని వెనక్కి నెట్టింది కీర్తి సురేష్. వరసగా సినిమాలు కమిటయి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో యమా బిజీగా ఉంది. 2020 ప్రారంభం వరకు కీర్తి సురేష్ అకౌంట్ లో ఇన్ని సినిమాలున్నాయని ఎవరూ అనుకోలేదు. కాని ఇప్పుడు చూస్తే లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ఇక రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు దక్కించుకుంది.

 

ఇక త్వరలో మిస్ ఇండియా అన్న సినిమా కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమా కూడా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇక గుడ్ లక్ సఖీ, అన్నాత్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలు కీర్తి సురేష్ నటిస్తున్న లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్ లో మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసిందని తెలుస్తుంది. త్వరలో ఆ సినిమాల వివరాలు అధికారకంగా వెల్లడికానున్నాయని సమాచారం.

 

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రంగ్ దే సినిమా గురించి. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ సరసన నటించింది కీర్తి. వాస్తవంగా ఈ సినిమా ఎపుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా మూలానా అన్ని సినిమాలు మాదిరిగా రంగ్ దే కూడా ఆగిపోయింది. ఈ ఏడాది భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ రంగ్ దే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాలుగేళ్ళ క్రితం అ..ఆ తో వచ్చిన సక్సస్ మళ్ళీ భీష్మ తోనే.

 

అదే సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేద్దామనుకున్నాడు. కాని కరోనా బ్రేకేసింది. ఇందులో కీర్తికి వాటా ఉంది. టాలీవుడ్ లో మహానటి తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ దక్కలేదు. దాంతో 2020 లో రంగ్ దే తో ఒక సూపర్ హిట్ ని అందుకోవాలనుకుంది. కాని కీర్తి కి ఇది సాధ్యం కాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: