టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా తన స్నేహితులతో కలిసి నైజాం ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితం ఆరంభించిన నిర్మాత దిల్ రాజు, ఆపై తాను కొనుగోలు చేసిన పలు సినిమాలతో మంచి లాభాలు అందుకున్నారు. ఇక ఆ తరువాత 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరిట తన తమ్ముడు, స్నేహితులతో కలిసి సొంతంగా బ్యానర్ ని స్థాపించి తొలిసారిగా దిల్ సినిమాని తీయడం జరిగింది. నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత నుండి రాజుకు దిల్ రాజు అంటే పేరు స్థిరపడిపోయింది. ఆ తరువాత నుండి వరుసగా అనేక విజయాలతో దూసుకెళ్లిన దిల్ రాజుకు అప్పట్లో గోల్డెన్ లెగ్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు వచ్చింది. 

IHG

ఆపై కొన్నాళ్ళు ఫెయిల్యూర్స్ కూడా చవి చూసిన రాజు, ఇటీవల మళ్ళి మంచి ఫామ్ లోకి రావడంతో తమ బ్యానర్ పై మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు. ఇకపోతే దిల్ రాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఇటీవల ఆయన భార్య అనిత కొన్ని అనారోగ్య కారణాల వలన మరణించడం, అలానే అంతకముందు తన కుమార్తె కూడా వివాహమై వెళ్లిపోవడంతో మానసికంగా కొంత కృంగిపోయిన రాజు, మళ్ళి వివాహం చేసుకోవాలని భావించారు. కాగా ఇటీవల లాక్ డౌన్ సమయంలో వైఘా రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న రాజు, ప్రస్తుతం ఆమెతో కలిసి హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాగా దిల్ రాజు రెండవ వివాహం అనంతరం ఆయన పై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొందరు సెటైర్లు వేస్తూ ఉండడంతో, వాటితో కొంత విసిగిపోయిన రాజు గారు, ఇటీవల అటువంటి వారిపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

 

తాను కూడా అందరివలె మనిషినే అని, తనకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయని, భార్య మరణానంతం ఎంతో కృంగిపోయిన తనకు ప్రస్తుతం తన జీవితంలో ప్రవేశించిన వైఘా రెడ్డి సరికొత్త జీవితాన్ని అందించిందని, నా జీవితం నాకు నచ్చిన విధంగా జీవించే హక్కు నాకు లేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పలువురు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఎంత సెలెబ్రిటీలు అయినప్పటికి కూడా వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని కదా, అలాగని వారి లైఫ్ లో జరిగిన ఘటనల్లో మనం తలదూర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, ఎవరి జీవితం వారిదని అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: