రీమేక్ అనగానే టాలీవుడ్ లో ముందుగా గుర్తొచ్చే పేరు ఒక్కటే అది విక్టరీ వెంకటేష్. కొంతమదేమో ఆల్రెడీ ఓ యాక్టర్ నటించిన సినిమా చేస్తే ఆ పాత్రలో అతనే కనిపిస్తాడు తప్ప మనమే చేస్తాం అనుకుంటారు. కాని వెంకటేష్ వర్షన్ అలా కాదు.. రీమేక్ సినిమాలు చేసినా వెంకీ పాత్రను ఓన్ చేసుకునే విధానం వేరేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మాత్రుక సినిమాల కన్నా బాగా ఉంటాయని చెప్పొచ్చు. కెరియర్ మొదట్లో తీసిన చంటి సినిమా నుండి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన గురు సినిమా వరకు రీమేక్ రారాజుగా వెంకీ అదరగొడతాడు. ఇక లేటెస్ట్ గా నారప్ప రీమేక్ లో నటిస్తున్నాడు వెంకటేష్.

 

ఇదేకాకుండా మరో సూపర్ హిట్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పునుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. మొదట్లో బాలకృష్ణ, రానా ఈ సినిమాలో నటిస్తారని అన్నారు. ఆ తర్వాత బాలయ్య ప్లేస్ లో రవితేజ వచ్చి చేరాడు. మాస్ రాజామూవీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలిసింది. అందుకే ఫైనల్ గా వెంకటేష్ ను ఫిక్స్ చేసినట్టు సమాచరం.

 

వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ సినిమాగా ఈ రీమేక్ రాబోతుంది. హరీష్ శంకర్రీమేక్ ను డైరెక్ట్ చేస్తారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ బయటకు వస్తాయట. అటు తిరిగి ఇటు తిరిగి సూపర్ హిట్ రీమేక్ మళ్లీ వెంకటేష్ చేతికే వచ్చింది. నారప్ప తర్వాత అయ్యప్పనుం కోషియం వెంకటేష్ సూపర్ హిట్ రీమేక్ లతో చెలరేగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.             

మరింత సమాచారం తెలుసుకోండి: