అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నారు. పుష్ప అంటూ వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటిసారి బన్ని కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ఫైట్ కి దిగుతున్నాడు.

 

ఇదిలాఉంటే ఈ సినిమా కోసం టెక్నాలజీని బాగా వాడేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ కు లేట్ అయ్యేలా ఉందని.. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ జూమ్ ద్వారా వర్చువల్ మ్యూజిక్ సెషన్స్ నిర్వహిస్తున్నారట.. సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే మ్యూజిక్ పూర్తి చేసేలా దేవిని గైడ్ చేస్తున్నాడట సుకుమార్. పుష్ప సినిమాతో డిఎస్పి తన మార్క్ చూపించాలని తహతహలాడుతున్నాడు.

 

ఈమధ్య థమన్ వరుస క్రేజీ హిట్లు కొడుతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కూడా స్టార్ సినిమాలైతే చేస్తున్నాడు కాని తన మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అందుకే పుష్పకు తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాడట దేవి శ్రీ ప్రసాద్. సుకుమార్ సినిమాకు దేవి శ్రీ స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తాడు. ఓవిధంగా చెప్పాలంటే సుకుమారే దేవి దగ్గర నుండి తనకు కావాల్సిన మ్యూజిక్ రప్పించుకుంటాడు. జూమ్ ద్వారానే మొత్తం సినిమా ఆల్బం పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.   

 

ఇప్పటికే సినిమాలో ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ బాగా హోం వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. షూటింగ్ లేకపోయినా సరే ఫిట్ నెస్ కోసం కెబిఆర్ పార్క్ లో జాగింగ్ చేస్తూ మీడియాకు కనిపించాడు బన్ని. ఎంచుకున్న పాత్ర కోసం కమిట్మెంట్ తో పనిచేస్తాడు కాబట్టే గంగోత్రి నుండి అల వైకుంఠపురములో వరకు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. 

మరింత సమాచారం తెలుసుకోండి: