సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నాడు. ఇప్పటివరకూ తన సినిమాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టిన మహేష్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి, ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అడవి శేష్ హీరోగా ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ చిత్రం మహేష్ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

 

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సగభాగం కంప్లీట్ చేసుకుంది. కరోనా కారణంగా చిత్రీకరణని ఆపివేశారు. అయితే మహేష్ నిర్మాణంలో మరో సినిమా రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి ఖాళీగా ఉన్నాడు. మహేష్ తో సినిమా చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు.

IHG

 

అయితే తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న సినిమాకి మహేష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. విజయ్ దేవరకొండ, మహేష్ ల మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం అందరికీ తెలుసు. అదీగాక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎవరి దర్శకత్వంలో నటించనున్నాడో ఇంకా క్లారిటీ లేదు.

IHG

 

అందువల్ల వంశీ, విజయ్ కాంబినేషన్ సెట్ అయ్యేట్టుందని చెబుతున్నారు. మరి వంశీతో సినిమా చేస్తానని ఆ తర్వాత కథ నచ్చక పరశురామ్ తో సర్కారు వారి పాటని ఒప్పుకున్న పరశురామ్, వంశీకి అవకాశం ఇస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: